
Tirupati: తిరుపతి పట్టణంలో వింత ఘటన చోటు చేసుకుంది.. వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా…

Tirupati: ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో వింత ఘటన చోటు చేసుకుంది. వాటర్ ఒక్కసారిగా భూమి నుంచి బయటకు వచ్చింది. దాంతో జనాలు హడలిపోయారు. వివరాల్లోకెళితే.. తిరుపతిలోని శ్రీకృష్ణా నగర్లో వింత వెలుగు చూసింది. 25 అడుగుల తాగు నీటి వాటర్ ట్యాంక్.. భూమిలో నుంచి బయటకు వచ్చింది. అది చూసిన స్థానిక ప్రజలు భయపడ్డారు. 18 సిమెంట్ రింగులతో భూమిలో వాటర్ ట్యాంక్ నిర్మించారు. తాజాగా ఆ ట్యాంక్ను శుభ్రం చేస్తుండగా.. ఒక్కసారిగా ట్యాంక్ పైకి లేచింది. ట్యాంక్ పైకి లేస్తుండటంతో.. అందులో ఉన్న మహిళ తీవ్ర భయాందోళనకు గురై.. ట్యాంక్ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేసింది. ఆ క్రమంలో మహిళకు స్వల్ప గాయాలు అయ్యాయి.
భూమిలోపలి నుంచి బయటకు వచ్చిన ట్యాంక్.. ఇప్పటికీ నిటారుగా నిలిచి ఉంది. ఈ వింతను చూసేందుకు స్థానిక ప్రజలు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. అయితే, దీనిపై అధికారులు స్పందించారు. ఇది సహజ పరిణామమే అని చెబుతున్నారు. గత వారం రోజులుగా కురిసిన వర్షాల కారణంగా భూమి లోపలి పొరలు బాగా నానడం వల్ల.. వాటర్ ట్యాంక్ ఉబికి వచ్చిందని చెబుతున్నారు. జనాలు కూడా భారీ వర్షాల కారణంగానే ఈ వింత చోటు చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా, ఇలాంటి ఘటనే తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలోనూ గతంలో జరిగింది. భారీ వర్షాల కారణంగా భూమి తడిసి అలా జరుగుతుందని గతంలోనూ అధికారులు తెలిపారు.
Also read:
Vikram: మళ్లీ పట్టాలెక్కిన కోబ్రా షూటింగ్.. సినిమా విడుదల ఎప్పుడంటే..
Indian Oil: ప్రభుత్వానికి రూ. 2,424 కోట్ల డివిడెండ్ చెల్లించిన IOC..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3cPSFPs
0 Response to "Tirupati: తిరుపతి పట్టణంలో వింత ఘటన చోటు చేసుకుంది.. వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా…"
Post a Comment