
Silver Price Today: స్వల్పంగా పెరిగిన వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?

Latest Silver Price: బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. బులియన్ మార్కెట్లో పసిడి, వెండి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరి కొన్నిసార్లు పెరుగుతుంటాయి. అందుకే బంగారం, వెండి కొనుగోలు చేసేవారు వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టిసారిస్తుంటారు. కరోనా కాలంలో దేశీయంగా పెరిగిన బంగారం, వెండి ధరలు కొన్నిరోజుల నుంచి తగ్గుతూ వచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల నుంచి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం భారీగా తగ్గిన వెండి ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం దేశంలో కిలో వెండి ధర రూ.65,000లుగా ఉంది. కిలో వెండిపై రూ.200మేర పెరిగింది. అయితే.. ఉత్తరాది ప్రాంతాల కంటే.. దక్షిణాది ప్రాంతాల్లోనే వెండి ధరలు ఎక్కువగా ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం..
ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వెండి ధర కిలో రూ.65,000 వద్ద కొనసాగుతోంది.
* దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ.65,000 లుగా ఉంది.
* బెంగళూరులో వెండి ధర కిలో వెండి రూ.65,000 గా కొనసాగుతోంది.
Baca Juga
* కేరళలో కిలో వెండి ధర రూ.69,100గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో..
* హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.69,100 లుగా కొనసాగుతోంది.
* విజయవాడలో వెండి ధర రూ.69,100 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ.69,100 లుగా ఉంది.
కాగా.. ఈ ధరలు శుక్రవారం ఉదయం 6 గంటలకు నమోదైనవి. ప్రతిరోజూ ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కొనుగోలుదారులు ముందుగానే ధరలు తెలుసుకుని వెళ్లడం మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
Also Read:
0 Response to "Silver Price Today: స్వల్పంగా పెరిగిన వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?"
Post a Comment