-->
మహా లక్ష్మి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు.. కరెన్సీ నోట్లతో అలంకరించిన భక్తులు..

మహా లక్ష్మి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు.. కరెన్సీ నోట్లతో అలంకరించిన భక్తులు..

Durgha Matha

దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఎంతో భక్తి శ్రద్దలతో ప్రజలు అమ్మవారిని పూజిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో అమ్మవారు వేరు వేరు అలంకారాల్లో దర్శననమిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా దేవీ నవరాత్రులు సంబరంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో ఆర్యవైశ్య సంఘంలో నెలకొల్పిన దుర్గామాత మహాలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా  అమ్మవారిని ధనం తో అలంకరించారు. సుమారు రూ. 35 లక్షల 55వేల 555రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు భక్తులు.

అలాగే కర్నూలు జిల్లా మంత్రాలయంలో మంచాలమ్మతల్లి ధనలక్ష్మి దర్శనమిచ్చారు. అమ్మవారి విగ్రహాన్ని రూ. 10నుంచి 100 నోట్లతో అలంకరించారు గ్రామస్తులు. ఏపీతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి వచ్చి భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో  దుర్గ మాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్‌కు ‘అలయ్ బలయ్’ ఆహ్వానం అందించిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె

Flipkart Festive Sale: ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్‌ సూపర్ హిట్..ఒక్కరోజులో లక్షకు పైగా చాక్లెట్స్ అమ్మేశారట..!

National Politics: అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఉత్తరాఖండ్‌లో బీజేపీకి ఊహించని షాక్‌..!

Tirumala – CM YS Jagan: ఒకే కుటుంబంలో ఇద్దరికి ముఖ్యమంత్రి హోదాలో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3aulFLs

Related Posts

0 Response to "మహా లక్ష్మి రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు.. కరెన్సీ నోట్లతో అలంకరించిన భక్తులు.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel