-->
TSRTC: తెలంగాణ ఆర్టీసీపై రాష్ట్ర సర్కార్ స్పెషల్ ఫోకస్.. అప్పుల ఊబి నుంచి గట్టేక్కించేందుకు ప్రణాళికలు.. ఏం చేయబోతున్నారంటే..?

TSRTC: తెలంగాణ ఆర్టీసీపై రాష్ట్ర సర్కార్ స్పెషల్ ఫోకస్.. అప్పుల ఊబి నుంచి గట్టేక్కించేందుకు ప్రణాళికలు.. ఏం చేయబోతున్నారంటే..?

Tsrtc

Telangana Govt. Focus on TSRTC: ఆర్టీసీ సమ్మె ,కరోనా మహమ్మారితో తెలంగాణ ఆర్‌టీసీ కొలుకోలేని దెబ్బ తగిలింది. మొదటి వేవ్ నుంచి కొలుకుని, నిలదొక్కుకుంటుంది అనుకునే సమయంలో సెకండ్ వేవ్ మళ్లీ ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. కరోనాతో అతలాకుతలమైన టీఎస్ఆర్టీసీని తిరిగి గాడిన పెట్టేందుకు ప్రభుత్వం సిద్దం అయింది. ఇందుకోసం ఇప్పటికే పూర్తి స్థాయి ఎండీని నియమించగా..ఇటీవలే సంస్థకు ఛైర్మెన్‌ను కూడా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆర్టీసీ పురోభివృద్దికి ప్రభుత్వం టార్గెట్‌ను కూడా ఫిక్స్ చేసింది. రానున్న నాలుగు నెలల్లో అప్పుల బాట నుండి లాభాల బాటలో పురోభివృద్ధి కనిపించాలని ఉన్నతాధికారులకు సూచనలు కూడా చేసిది సర్కార్.

టీఎస్ఆర్టీసీని.. అన్ని ప్రభుత్వరంగ సంస్థల కంటే.. ఎప్పుడూ కష్ట నష్టాల్లో తీవ్ర ఒడుదుడుకులు ఎదుర్కొంటున్న సంస్థగానే చెప్పాల్సి ఉంటుంది..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన టీఎస్ఆర్టీసీలో ఎన్నో మార్పులు వచ్చాయి.. కొత్త రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగిపోతున్న తరుణంలో ఆ సంస్థ కార్మికులు చేపట్టిన సుదీర్ఘ సమ్మెతో టీఎస్ఆర్టీసీ భవిష్యత్ ఎలా ఉంటుందో అన్న చర్చ సాగింది. కానీ, తెలంగాణ ప్రభుత్వం సమ్మె చేస్తున్న కార్మికులు ఊహించని విధంగా.. సంస్థలో సిబ్బంది, కార్మికుల అభివృద్ధికి పెద్దపీఠ వేసేలా నిర్ణయాలు తీసుకుని.. ఆర్టీసీలో అన్ని విభాగాలను గాడినపెట్టేలా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది..
సమ్మె తరువాత టీఎస్ఆర్టీసీ దశల వారిగా కోలుకుంటూ వస్తోంది. కరోనా కారణంగా ఎప్పుడూ లేని విధంగా తీవ్ర నష్టాల్లోకి వెళ్లింది. ఏడాదిన్నర కాలంలోనే 2 వేల 780 కోట్ల రూపాయల నష్టాలు వచ్చాయని టీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులే చెబుతున్నారు. ఆర్టీసీ అప్పు మొత్తం.. 2021 జూన్ 21 నాటికి రూ. 6వేల 115 కోట్లుగా తేల్చారు.

ప్రభుత్వ గ్యారెంటీ కింద వివిధ బ్యాంకలలో రూ.1,677 కోట్లు తీసుకోగా.. హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ వద్ద లోన్స్ రూపంలో రూ.35 కోట్లు కాగా.. మొత్తం కలిపి రూ.1,712 కోట్లు వివిధ రూపాల్లో లోన్ తీసుకుంది. అంతేకాకుండా ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్, రూ.1,405 కోట్లు.. సీసీయస్‌కు రూ. 908, ఎస్‌బిటీయస్ఆర్‌బీయస్ సీసీయస్ కలిపి రూ. 502కోట్లు, ఉద్యోగుల లీవ్ ఇన్ క్యాష్మెంట్ 2014 నుంచి 2020 వరకూ రూ. 250 కోట్ల చెల్లింపుల పెండింగ్‌లోనే ఉన్నాయి..అలాగే, రిటైర్డ్ ఎంప్లాయిస్ సెటిల్మెంట్ 2018 నుంచి ఇప్పటి వరకూ రూ.100 కోట్లు చెల్లించాలి. అంతేకాకుండా 2013 నుంచి 2020 వరకూ50శాతం ఆర్‌పీయస్ ఏరీయర్స్ బాండ్స్ కింద బాకీ ఉన్న సొమ్ము రూ.280 కోట్లు, మొత్తం రూ.4వేల 480కోట్లు కేవలం కార్మికులకు వివిధ రూపాల్లో చెల్లింపులు చేయాల్సినవే ఉన్నాయి.

ఇందులో ప్రధానంగా కార్మికుల ఈపీయస్‌కు 2019 డిసెంబర్ నుంచే చెల్లింపులు చేయడం లేదు. ఇక, కార్మికుల భవిష్యత్ నిధి సంబంధించి 2018 19 నుంచి చెల్లింపులే లేవు. అంతేకాకుండా పిఎఫ్‌లో ఎంప్లాయిస్ షేర్ 2017 18 వరకూ జమ చేయడం లేదు. 2014 నుంచి 2021 22 బడ్జెట్ వరకూ ఆర్టీసీకి బడ్జెట్ ఎస్టిమేట్ మొత్తం రూ.1,360 కోట్లుగా నిర్ణయించారు. 2014 15 సంవత్సరానికి రూ.100 కోట్లు కేటాయించగా.. వంద కోట్లు రిలీజ్ చేశారు..2015 16 సంవత్సరానికి గాను రూ.110 కోట్లు బడ్జెట్‌లో కేటాయించగా.. రిలీజ్ సొమ్ము..రూ.102.50కోట్లు మాత్రమే.. 2016 17 సంవత్సరంలో రూ.110 కోట్లు బడ్జెట్ లో కేటాయించగా రూ.27.5 కోట్లు రిలీజ్ చేసింది. ఇక, 2017 18 సంవత్సరంలో రూ.520 కోట్లు బడ్జెట్ లో పెట్టగా కేవలం రూ.260 కోట్లు కేటాయించింది. ఇక, 2018 19 సంవత్సరంలో రూ.520 కోట్లు బడ్జెట్ లో పెట్టి కేవలం రూ.130 కోట్లు విడుదల చేశారు. ఇక, 2019 నుంచి 2021 22 వరకూ అంచనా బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండానే.. సవరణలో 2019 20 ఏడాది లో రూ.850 కోట్లు,2020 21 లో రూ.వెయ్యి కోట్లు, ప్రస్తుతం ఏడాది బడ్జెట్‌లో రూ.1,500 కోట్లు బడ్జెట్ లో కేటాయించింది. మిగిలిన రూ.1,500 కోట్లు బ్యాంకు గ్యారెంటీ కింద ఇటీవల ఆర్టీసీకి రుణాన్ని ఇప్పించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

అయితే, గత మూడేళ్లుగా టీఎస్ఆర్‌టీసీ ని ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూనే వస్తుంది.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి బాటలో పయనిస్తుందనుకుంటున్న సమయంలో ఆర్టీసీకి, కరోనా పెద్ద ఎఫెక్ట్ గానే చెప్పు కోవాలి. యకరోనానుంచి ఇప్పుడిప్పుడే ఆర్టీసీ కొలుకుంటుంది.. కరోనాకు ముందు రోజుకు రూ,10నుంచి 12 కోట్లు రోజు వారిగా ఆదాయం వచ్చేది. తాజాగా రోజు వారి ఆదాయం రూ.13.4 కోట్లుకు సంస్థ ఆదాయం చేరింది. టికెట్ ఆదాయంతో పాటు టికెటేతర ఆదాయం కూడా భారీగానే పెరిగింది. కార్గో పార్సెల్ కొరియర్ ద్వారా రోజు కు మరో రెండు కోట్లు అదనపు ఆదాయం వస్తుంది.. కరోనా తరువాత.. 78 శాతం ఒ.ఆర్ తో’ రికార్డు స్థాయిలో నిలిచింది. గడిచిన ఆగస్ట్ నెల 23న రూ .13.04 కోట్ల ఆదాయం ఆర్టీసీ తన ఖాతాలో వేసుకుంది. కరోనా తరువాత 31.77 లక్షల కిలోమీటర్లు బస్సులను నడపి 41.05 ఇ.పి.కె (ఎర్నింగ్ ఫర్ కిలోమీటర్) సాధించింది. ఓ వైపు కరోనా వివత్కర పరిస్థితులు, మరో వైపు డీజిల్ పెరుగుదల ఒకింత ఆర్టీసీ కి తీవ్ర అవరోధాలుగా నిలుస్తున్నాయి.. 2014నుంచి ఇప్పటి వరకూ రూ.7వేల 485.43 కోట్లు ఖర్చు చేసింది..ఇందులో ఎక్సైజ్ డ్యూటీ,vat కలుపుకున్ని రూ.3,468.89కోట్లు ఆర్టీసీ ఇంధన సంస్థలకు చెల్లిస్తుంది..

సమ్మె తరువాత కార్మికులు సిబ్బంది ఉద్యోగ భద్రత పై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఉద్యోగుల పదోన్నతి పెంపు, మహిళా కండక్టర్ లకు డ్యూటీ లో మార్పు, కార్మికుల సంక్షేమంతో 56 అంశాలపై ప్రత్యేక దృష్టి సారించింది.. కార్మిక సంఘాల ప్లేసులో, ఏ డిపోలో సమస్యని ఆ డిపోలో పరిష్కరించేందుకు కార్మిక సంక్షేమ మండలి, ఏర్పాటు చేసింది.. గత మూడేళ్లుగా బడ్జెట్లో కేటాయించిన నిధులతో పాటు బడ్జెట్ తో సంబంధం లేకుండా కూడా రుణం కూడా ఇప్పించే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. గతంలో సంస్థ సీ.సీ.యస్ దగ్గర నుంచి తీసుకున్న రుణాలను కూడా దశల వారిగా చెల్లింపు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది.. ఇందులో భాగంగా కరోనా నుంచి కొలుకుని ఇప్పుడిప్పుడే బయట పడుతున్న ఆర్టీసీని తిరిగి వెనుకకు చూసుకోకుండా ఉండేలా సంస్థ పురోభివృద్ధికి బాటలు వేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి దృష్టి సారించారు. రాష్ట్ర ఏర్పడిన నాటి నుంచి ప్రస్తుత పరిస్థితిపై ముఖ్యమంత్రి సుదీర్ఘ సమీక్ష నిర్వహించడం పై ఆర్టీసీలో కొత్త చర్చ మొదలైంది. సంస్థ అప్పులు, ఆస్తుల వివరాలపై ఆరా తీయడంపై సంస్థలో పెద్ద చర్చ సాగుతోంది..ముఖ్యమంత్రి కేసీఆర్.. మరోసారి ఆర్టీసీ అభివృద్ధిపై దృష్టి సారించడం మంచి పరిణామం అంటున్నారు. తీవ్ర ఒడుదుడుకుల నుంచి సంస్థ ను శాశ్వత కాపాడేందుకు టి.సర్కార్ ఫోకస్ పెట్టినంటుగా తెలుస్తోంది..అందులో భాగంగా సంస్థ ఆస్తుల వివరాలను ఇప్పటికే ప్రభుత్వం వద్దకి చేరినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ శాశ్వతంగా గట్టెక్కాలంటే టికెట్ రేట్లు పెంపు లేకపోతే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న సంస్థ భూములను అమ్మకానికి పెట్టడం మాత్రమే ప్రభుత్వం ముందున్న అంశాలు..

ఒకవైపు ఆర్‌టీసీ గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తూనే మరో వైపు సంబంధిత అధికారులకు టార్గెట్లను ఫిక్స్ చేస్తుంది ప్రభుత్వం. రానున్న 3, 4 నెలల్లో లాభాల బాటలో నడవాలని సూచించారు. దీంతో పాటు ఏ రూట్లలో మంచి ఆదాయం వస్తుంది. ఏ రూట్లలో ఆదాయం తక్కువగా ఉంది. దానికి గల కారణలను అన్వేషిస్తుంది. ఇవన్నీ ఫలించకపోతే ఆర్‌టీసీ ప్రైవేటీకరణ తప్పదు అంటూ ఓ రకమైన లీక్‌లు కూడా వస్తున్నాయి. అదే జరిగితే ప్రస్తుతం పని చేస్తున్న కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. కాబట్టి అందరూ కలిసి కట్టుగా ఆర్‌టీసీని ముందుకు నడిపించాలని అనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట.

ప్రస్తుతం కరోనా నుంచి కొలుకుంటున్న ఆర్టీసీ.. కొంత ఆలస్యమైన జీతాల చెల్లింపులు చేస్తుంది. మరికొన్ని రోజుల్లో సంస్థ బాకీ పడిన మొండి బకాయిలను చెల్లించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే సంస్థ అప్పులు, ఆస్తుల వివరాలు సేకరించి, త్వరలోనే సంస్థను శాశ్వతంగా ఆర్థికాభివృద్ధి లో పయనించేలా ఆలోచన చేస్తునంటూ తెలుస్తోంది.. గత కొద్ది రోజులుగా ఆర్టీసీ మూసివేత వేసేందుకు ప్రయత్నం జరుగుతుందనే ప్రచారానికి సైతం తెర తీయబోతునట్టు తెలుస్తోంది. ఆర్టీసీ అంటే పల్లె నుంచి పట్నం వరకు అభివృద్ధి సంకేతం. అలాంటిది నష్టాల నుంచి ప్రభుత్వం అదుకోకపోగా ఉన్న ఆస్తులను అమ్మివేయాలను కోవడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. ఆస్తులు అమ్మితే ఆర్టీసీ భవిష్యత్ ప్రశ్నార్ధకమే అవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కట్టె విరగొద్దు పాము చావద్దు అన్నట్లు ప్రభుత్వం కొత్త ప్రణాళికలను సిద్ధం చేసింది.

Read Also…. News Watch: ప్రతిపక్షాల మహాధర్నా లో ఏం తేల్చారు ?? మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్…

 



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3CCAmIj

Related Posts

0 Response to "TSRTC: తెలంగాణ ఆర్టీసీపై రాష్ట్ర సర్కార్ స్పెషల్ ఫోకస్.. అప్పుల ఊబి నుంచి గట్టేక్కించేందుకు ప్రణాళికలు.. ఏం చేయబోతున్నారంటే..?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel