
Pro Kabaddi: ఉత్కంఠ పోరులో తెలుగు టైటాన్స్ ఓటమి.. చివర్లో ఏం జరిగిందంటే..

ప్రొ కబడ్డీ లీగ్ ఎనిమిదో సీజన్లో శనివారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్పై పుణెరి పల్టాన్ ఒక్క పాయింట్ తేడాతో విజయం సాధించింది. నిర్ణీత సమయంలో తెలుగు టైటాన్స్ 33 పాయింట్లు సాధించగా.. పుణెరి పల్టాన్ 34 పాయింట్లు సాధించింది. మాచ్య్ 33-34 పాయింట్లు ఉన్న సందర్భంలో తెలుగు టైటాన్ నుంచి రైడ్కు వెళ్లిన రాకేష్ బోనస్ పాయింట్ సాధించాననే నమ్మకంతో తిరిగొచ్చాడు.
కానీ రిఫరీ పాయింట్ ఇవ్వలేదు. సమీక్ష కోరినా ఫలితం లేకపోయింది. దీంతో టైటాన్స్ 33-34తో చేజేతులారా ఓటమి పాలైంది. సిద్ధార్థ్ దేశాయ్ (15) పోరాటం వృథా అయింది. పల్టాన్ తరపున మోహిత్ (9) అస్లామ్ (8), అభినేష్ (5) రాణించారు. మ్యాచ్లో ప్రత్యర్థిని ఆలౌట్ చేసిన టైటాన్స్ ఓ దశలో 17-13తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత సిద్ధార్థ్ సూపర్ రైడ్తో 20-14తో తొలి అర్ధభాగాన్ని ముగించింది. కానీ రెండో భాగంలో పుంజుకున్న పుణెరి.. టైటాన్స్ను వెనక్కినెట్టింది.
మోహిత్, అస్లామ్ రైడింగ్కు తోడు.. డిఫెన్స్లో ఆ జట్టు బలంగా కనిపించింది. టైటాన్స్ను ఆలౌట్ చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ సిద్ధార్థ్ పోరాటం కొనసాగించడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారినా ఆఖర్లో ఓటమి చవిచూడక తప్పలేదు. అంతకుముందు జరిగిన మ్యాచ్లో యూపీ యోధ 36-35తో పట్నా పైరేట్స్పై గెలిచింది. యూపీ ఆటగాడు పర్దీప్ (12), సుమిత్ (6).. పట్నా జట్టులో సచిన్ (10), ప్రశాంత్ (8), మహమ్మద్రెజా (7) ఆకట్టుకున్నారు. మూడో మ్యాచ్లో జైపుర్ పింక్ పాంథర్స్ 40-38తో హరియాణా స్టీలర్స్పై గెలుపొందింది. జైపుర్ జట్టులో అర్జున్ (18), దీపక్ (10) సత్తాచాటారు. హరియాణా తరపున వికాస్ (14), రోహిత్ (7) రాణించారు.
Super raids, super tackles, super se bhi upar wala #SuperhitPanga!
The amount of ‘Super’ in this blockbuster was just
as @PuneriPaltan register a slender win against @Telugu_Titans
#PUNvTT #vivoProKabaddi pic.twitter.com/1ewoX6esSg
— ProKabaddi (@ProKabaddi) December 25, 2021
Read Also.. IND vs SA: పంత్, సాహా.. తుది జట్టులో చోటు ఎవరికి.. రాహుల్ ద్రవిడ్ ఏం చెప్పాడు..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3qjXqHk
0 Response to "Pro Kabaddi: ఉత్కంఠ పోరులో తెలుగు టైటాన్స్ ఓటమి.. చివర్లో ఏం జరిగిందంటే.."
Post a Comment