
ఈ పిరికెడు గింజలు గుడ్డుతో సమానం..! ఇందులో ఉండే పోషకాలు నాన్వెజ్ నుంచి కూడా దొరకవు..?

Peanuts: గుడ్లు ప్రోటీన్కి మంచి మూలం. అయితే శాఖాహారం తీసుకునే వారు ఏం చేయాలి? అలాంటివారు రోజూ కొన్ని వేరుశెనగలను తింటే శరీరంలో ప్రొటీన్ లోపాన్ని అధిగమించవచ్చు. పిరికెడు వేరుశెనగలలో గుడ్డులో ఉన్నంత ప్రోటీన్ ఉంటుంది. అదే సమయంలో 100 గ్రాముల పచ్చి వేరుశెనగలో ఒక లీటరు పాలకు సమానమైన ప్రోటీన్ ఉంటుంది. ఇది మాత్రమే కాదు వేరుశెనగలో లభించే ఇతర ఖనిజాలు, విటమిన్లు నాన్ వెజ్ నుంచి కూడా దొరకవు.
చలికాలంలో వేరుశెనగనలను బాగా తీసుకోవాలి. పచ్చి వేరుశెనగను నీటిలో నానబెట్టి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. దీని కారణంగా వేరుశెనగ లక్షణాలు మరింత పెరుగుతాయి. నానబెట్టిన వేరుశనగ శరీరంలోని రక్తహీనతను దూరం చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన వేరుశెనగను తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీని కారణంగా శరీరానికి యాంటీఆక్సిడెంట్లు, ఐరన్, ఫోలేట్, కాల్షియం, జింక్ వంటి పోషకాలు అందుతాయి, ఇవి శరీరాన్ని లోపలి నుంచి బలంగా చేస్తాయి.
గుప్పడె వేరుశెనగలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వేరుశెనగలో ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి. అటువంటి పరిస్థితిలో ఇది గుండె రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.నానబెట్టిన వేరుశెనగ రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. అటువంటి పరిస్థితిలో డయాబెటిక్ రోగులు చాలా హాయిగా తినవచ్చు. దీని ద్వారా చాలా ప్రయోజనం పొందవచ్చు. పొటాషియం, మాంగనీస్, కాపర్, కాల్షియం, ఐరన్, సెలీనియం మొదలైన అనేక పోషకాలు వేరుశెనగలో లభిస్తాయి. నానబెట్టిన వేరుశెనగలను రోజూ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్, ఎసిడిటీ సమస్య దూరం అవుతుంది.
Childrens: పిల్లలు ఈ కూరగాయలను ఇష్టపడరు.. కానీ ఇందులోనే పోషకాలు అధికం..
Swiggy Reveals 2021: ఈ సంవత్సరం మొదటి ఓటు బిర్యానికే.. తర్వాత సమోస, గులాబ్జామ్..
Health Care Tips: శీతాకాలంలో డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటున్నారా? లేని ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లే..!
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3enBmpQ
0 Response to "ఈ పిరికెడు గింజలు గుడ్డుతో సమానం..! ఇందులో ఉండే పోషకాలు నాన్వెజ్ నుంచి కూడా దొరకవు..?"
Post a Comment