
Silver Price Today: పెరిగిన వెండి ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో సిల్వర్ ధరలు ఇలా..!

Silver Price Today: పండగ సీజన్లు వచ్చేస్తున్నాయి. పండుగలకు నగలు వేసుకోవడం చాలా మందికి ఇష్టం. దీంతో పాటు వెండి కొనుగోళ్లు బాగానే జరుగుతుంటాయి. భారతీయులు వెండి కూడా చాలా ప్రాముఖ్యత ఇస్తుంటారు. ముఖ్యంగా వెండి దీపాలు, వెండి విగ్రహాలు కొనుగోలు చేస్తుంటారు. అలాగే వెండితే తయారు చేసిన రకరకాల అభరణాలను సైతం చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. దేశంలో బంగారం, వెండికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. తాజాగా బంగారం ధర స్థిరంగా ఉంటే వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి. ఆదివారం (అక్టోబర్ 10) దేశీయంగా ప్రధాన ప్రాంతాలలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రూ.61,800 ఉండగా, చెన్నైలో రూ.65,900 ఉంది. ముంబైలో కిలో వెండి రూ.61,800 ఉండగా, కోల్కతాలో రూ.61,800 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.65,900 ఉండగా, కేరళలో రూ.65,900 ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.65,900 ఉండగా, విజయవాడలో రూ. 65,900 వద్ద కొనసాగుతోంది.
కాగా, ప్రధాన నగరాల్లో ఉన్న జ్యూయలర్స్, వెబ్సైట్ల ఆధారంగా వెండి ధరలు ఉంటాయి. బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజు అనేక మార్పు చేసుకుంటుండటం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు మార్పులు కావడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్లో ధరలు హెచ్చు తగ్గులు కావడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయ పరమైన కారణాలు ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే వినియోగదారులు కొనుగోలు చేసే సమయానికి ముందుగానే ధరల వివరాలు తెలుసుకొని వెళ్లడం మంచిది.
Maa Elections 2021: ఎక్స్ట్రాలు ఆపండి..! నరేశ్ వ్యాఖ్యలపై శ్రీకాంత్ సీరియస్..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3lpIgin
0 Response to "Silver Price Today: పెరిగిన వెండి ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో సిల్వర్ ధరలు ఇలా..!"
Post a Comment