
Silver Price Today: బంగారం బాటలోనే వెండి.. పెరిగిన సిల్వర్ ధరలు..తాజాగా ఎంత పెరిగిందంటే..

Silver Price Today: పండగ సీజన్లు వచ్చేస్తున్నాయి. పండుగలకు నగలు వేసుకోవడం చాలా మందికి ఇష్టం. దీంతో పాటు వెండి కొనుగోళ్లు బాగానే జరుగుతుంటాయి. భారతీయులు వెండి కూడా చాలా ప్రాముఖ్యత ఇస్తుంటారు. ముఖ్యంగా వెండి దీపాలు, వెండి విగ్రహాలు కొనుగోలు చేస్తుంటారు. అలాగే వెండితే తయారు చేసిన రకరకాల అభరణాలను సైతం చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. దేశంలో బంగారం, వెండికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. తాజాగా బంగారం ధర పెరిగితే వెండి ధరలు కూడా పెరిగాయి. దేశంలోని వివిధ నగరాల్లో రూ.500 దాకా పెరిగాయి. శుక్రవారం (అక్టోబర్ 8) దేశీయంగా ప్రధాన ప్రాంతాలలో వెండి ధరలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రూ.61,200 ఉండగా, చెన్నైలో రూ.65,200 ఉంది. ముంబైలో కిలో వెండి రూ.61,200 ఉండగా, కోల్కతాలో రూ.61,200 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.61,200 ఉండగా, కేరళలో రూ.61,200 ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.65,200 ఉండగా, విజయవాడలో రూ. 65,200 వద్ద కొనసాగుతోంది.
కాగా, ప్రధాన నగరాల్లో ఉన్న జ్యూయలర్స్, వెబ్సైట్ల ఆధారంగా వెండి ధరలు ఉంటాయి. బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజు అనేక మార్పు చేసుకుంటుండటం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు మార్పులు కావడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్లో ధరలు హెచ్చు తగ్గులు కావడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయ పరమైన కారణాలు ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే వినియోగదారులు కొనుగోలు చేసే సమయానికి ముందుగానే ధరల వివరాలు తెలుసుకొని వెళ్లడం మంచిది.
Healthy Heart: ఆరోగ్యకరమైన హృదయానికి 5 ఆయుర్వేద మూలికలు.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3iHCF5p
0 Response to "Silver Price Today: బంగారం బాటలోనే వెండి.. పెరిగిన సిల్వర్ ధరలు..తాజాగా ఎంత పెరిగిందంటే.."
Post a Comment