
Crime News: ఇలా ఎందుకు చేశావమ్మ..? ఇద్దరు పిల్లలను చంపిన కన్నతల్లి.. ఉరి వేసి దారుణంగా..

Mother Killed 2 children: ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి ఇద్దరు పిల్లలనూ ఉరివేసి చంపింది. ఈ దారుణ సంఘటన రాజమండ్రి పట్టణంలోని ఆనంద్నగర్లో జరిగింది. ఈ సంఘటన జిల్లాలో కలకలం రేపింది. తాడేపల్లికి చెందిన అనూష 13 ఏళ్ల కిందట భర్త చనిపోవడంతో రాజమండ్రికి వచ్చి బ్యూటీషియన్గా పనిచేస్తోంది. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. అయితే.. ఇటీవల పిల్లల విషయంలో ఆమె తల్లితో సైతం గొడవ పడింది. పిల్లల్ని కొట్టద్దని అడొచ్చిన తల్లి ముత్యం కనకదుర్గను సైతం అనూష గాయపర్చింది.
ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి కుమార్తె చిన్మయి (8), మోహిత్ (6) ను ఇంట్లో ఉరివేసి చంపినట్లు బంధువులు పేర్కొన్నారు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వివరాలు సేకరించారు. అనంతరం చిన్నారుల మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాజమండ్రి త్రీ టౌన్ పోలీసులు అనూషను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే.. పిల్లలను ఉరివేసి చంపిన అనంతరం అనూష ప్రియుడికి ఫోన్ చేసినట్లు సమాచారం.
అక్రమ సంబంధానికి అడ్డు తొలగించుకోవడానికి పిల్లలను చంపిందా.. లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారిస్తున్నట్లు త్రీ టౌన్ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read:
Guntur: గుంటూరు అర్బన్ పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలోని నడింపాలెం జాతీయ రహదారిపై జోరుగా వ్యభిచారం
Cruise Drugs Case: ఆ మహిళ డ్రగ్స్ వాటిలో దాచి షిప్ లోకి తీసుకువెళ్ళింది.. వెల్లడించిన ఎన్సీబీ అధికారులు
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3oV3hnz
0 Response to "Crime News: ఇలా ఎందుకు చేశావమ్మ..? ఇద్దరు పిల్లలను చంపిన కన్నతల్లి.. ఉరి వేసి దారుణంగా.."
Post a Comment