
లఖీమ్పూర్ ఖేరిలో హైడ్రామా.. బాధిత రైతు కుటుంబాలను పరామర్శించిన రాహుల్, ప్రియాంక గాంధీ..

ఉత్తరప్రదేశ్లోని లఖీమ్పూర్ ఖేరీ జిల్లాలో జరిగిన రైతు మరణాలు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ ప్రాంతమంతటా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా లఖీమ్పూర్ ఖేరీ పర్యటనకు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలకు యూపీ ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయి. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య లఖీమ్పూర్ ఖేరీ ఘటనలో మృతి చెందిన రైతుల కుటుంబాలను రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ పరామర్శించారు.
पत्रकार शहीद रमन कश्यप के परिवार से मिलकर शोक व्यक्त किया।
अपनों को अमानवीय क्रूरता के हाथों खोने वाले ये परिवार क्या चाहते हैं?
न्याय- दोषियों को तुरंत गिरफ़्तार किया जाए व मिनिस्टर को पद से हटाया जाए।और अब न्याय करना होगा! pic.twitter.com/sd7huPcVuh
— Rahul Gandhi (@RahulGandhi) October 6, 2021
లక్నో విమానాశ్రయం నుంచి తన సొంత వివాహంలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు రాహుల్ గాంధీ బయల్దేరుతుండగా.. సొంత వాహనంలో వెళ్లడం కుదరని.. పోలీస్ వాహనంలోనే వెళ్లాలని ఆయన్ని పోలీసులు అడ్డగించారు. ”నాకు వాహనం ఏర్పాటు చేయడానికి మీరెవరు. నేను నా సొంత వాహనంలో వెళ్తాను” అంటూ రాహుల్ గాంధీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసి ధర్నాకు దిగారు.
‘నా వాహనంలో వెళ్లేందుకు అనుమతించేవరకు ఇక్కడ నుంచి కదలను. రైతులను దోచుకోవడమే కాకుండా.. వారిని అణిచివేస్తున్నారు. మూడు వ్యవసాయ చట్టాలు ఎవరి కోసం చేశారో అందరికీ తెలుసు’ అంటూ రాహుల్ గాంధీ ఫైర్ కావడంతో దిగొచ్చిన పోలీసులు సొంత వాహనంలో వెళ్లేందుకు అనుమతించారు. దీనితో రాహుల్ గాంధీ లక్నో విమానాశ్రయం నుంచి బయల్దేరి సీతాపూర్ గెస్ట్హౌస్లో ఉన్న ప్రియాంక గాంధీని కలుసుకున్నారు.
शहीद लवप्रीत के परिवार से मिलकर दुख बाँटा लेकिन जब तक न्याय नहीं मिलेगा, तब तक ये सत्याग्रह चलता रहेगा।
तुम्हारा बलिदान भूलेंगे नहीं, लवप्रीत।#लखीमपुर_खीरी pic.twitter.com/TklEi7e5Ok
— Rahul Gandhi (@RahulGandhi) October 6, 2021
ఇక మూడు రోజుల నిర్భంధం తర్వాత ప్రియాంక గాంధీని విడుదల చేస్తున్నట్లు అదనపు మేజిస్ట్రేట్ ప్రకటించడంతో.. వీరిరువురూ కలిసి కాల్పుల్లో మరణించిన లవ్ప్రీత్ సింగ్, రమన్ కాశ్యప్ కుటుంబాలను పరామర్శించారు. ఆ తర్వాత మరో బాధితుడు నచార్ సింగ్ ఇంటికి వెళ్లారు.
शहीद सरदार नच्छतर सिंह के परिवारजनों से मिला, शोक संवेदनाएँ व्यक्त की।#लखीमपुर_नरसंहार के इन पीड़ित परिवारों ने दोहरी क्षति झेली है- अपनों को खोने का दुख तो है ही साथ में सरकार भी लगातार वार कर रही है।
लेकिन क्रूरता की इस रात की सुबह ज़रूर होगी।#NyayHokarRahega pic.twitter.com/A1tXRdqPlJ
— Rahul Gandhi (@RahulGandhi) October 6, 2021
సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు..
లఖీమ్పూర్ ఖేరీలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తలపెట్టిన రైతుల నిరసనలో చోటు చేసుకున్న హింసాకాండను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం దీనిపై విచారణ చేపట్టనుంది.
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/308jvzn
0 Response to "లఖీమ్పూర్ ఖేరిలో హైడ్రామా.. బాధిత రైతు కుటుంబాలను పరామర్శించిన రాహుల్, ప్రియాంక గాంధీ.."
Post a Comment