
ఇకనుంచి సైనిక్ స్కూల్స్, మిలటరీ కాలేజీలలో అమ్మాయిలకు ప్రవేశం.. మొదటి బ్యాచ్ ప్రవేశాలు ఎప్పుడంటే..?

RIMC, RMS Exam : డిసెంబర్ 18 న జరిగే మిలటరీ కళాశాల ప్రవేశ పరీక్షలో బాలికలకు అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. జస్టిస్ సంజయ్ నేతృత్వంలోని ధర్మాసనం జూన్ 2022 వరకు వేచి ఉండకుండా ఈ సంవత్సరం RIMC ప్రవేశ పరీక్షకు బాలికలను అనుమతించాలని కేంద్రానికి సూచించింది. బాలికల నుంచి దరఖాస్తులు పొందడానికి రెండు రోజుల్లో మార్పులు చేసి మళ్లీ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించింది. అయితే కేంద్రం ఈ విషయంపై ఆరు నెలలు సమయం ఇవ్వాలని కోరింది. కానీ సుప్రీం కోర్టు దానికి నిరాకరించింది. ఇప్పటివరకు ప్రతిష్టాత్మక రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ (RIMC), రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్లో(RMS) కేవలం అబ్బాయిలను మాత్రమే చేర్చుకునేవారు. అయితే జెండర్ ఆధారంగా అసమానతను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు కేంద్రాన్ని నిలదీసింది. అమ్మాయిలకు కూడా అవకాశం కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
జూన్ 2022 RIMC ప్రవేశ పరీక్షలో బాలికలు కనిపిస్తారు
ఈ విషయంపై కేంద్రం జూన్ 2022 లో RIMC ప్రవేశ పరీక్షలో బాలికలకు అవకాశం కల్పిస్తామని తెలిపింది. మొదటి బ్యాచ్ జనవరి 2023 లో ప్రవేశం పొందుతుందని పేర్కొంది. క్రమంగా అమ్మాయిల సంఖ్య పెరుగుతుంది. జనవరి 2028 లో, 250 మంది అబ్బాయిలతో పాటు,100 మంది అమ్మాయిలు కూడా RIMC లో ఉంటారు. అయితే బాలికల కోసం మౌలిక సదుపాయాలలో మార్పులు, గోప్యత, భద్రతకు సంబంధించి కల్పించాల్సిన సదుపాయాల అవసరాన్ని అఫిడవిట్ సూచించింది. అవసరమైన అధికారులు, సిబ్బందిని ఏర్పాటు చేయడానికి కొంత సమయం పడుతుందని తెలిపింది. రాష్ట్రీయ సైనిక పాఠశాలల్లో బాలికల ప్రవేశాలకు రిజర్వేషన్ల ప్రకారం.. 6 వ తరగతికి ప్రవేశం మొదటి దశలో మొత్తం ఖాళీలలో 10% కోటా ఉంటుంది.
Lion Fish: అరుదైన జీవి ‘సింహం చేప’.. అందంగా ఉందని పట్టుకుంటే పక్షవాతం.. విషం చిమ్మితే మరణం..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3lkplW9
0 Response to "ఇకనుంచి సైనిక్ స్కూల్స్, మిలటరీ కాలేజీలలో అమ్మాయిలకు ప్రవేశం.. మొదటి బ్యాచ్ ప్రవేశాలు ఎప్పుడంటే..?"
Post a Comment