
Silver Price Today: పెరిగిన వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?

Latest Silver Price: మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరి కొన్నిసార్లు తగ్గుముఖం పడుతుంటాయి. అందుకే బంగారం, వెండి కొనుగోలు చేసేవారు వాటి ధరలవైపు ప్రత్యేకంగా దృష్టిపెడుతుంటారు. కరోనా కాలంలో దేశీయంగా పెరిగిన బంగారం, వెండి ధరలు కొన్నిరోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. ఈ తరుణంలో రెండు రోజుల నుంచి తగ్గిన వెండి ధరలు.. తాజాగా పెరిగాయి. గురువారం దేశంలో కిలో వెండి ధర రూ.63,400లుగా ఉంది. కాగా.. ఉత్తరాది ప్రాంతాల కంటే.. దక్షిణాది ప్రాంతాల్లో వెండి ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఉత్తరాదిన 200మేర ధర పెరిగితే.. దక్షిణాదిన కిలో వెండి ధరపై రూ.300మేర పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం..
ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వెండి ధర కిలో రూ. 63,400 వద్ద కొనసాగుతోంది.
* దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ.63,400లుగా ఉంది.
* బెంగళూరులో వెండి ధర కిలో వెండి రూ.63,400 గా కొనసాగుతోంది.
Baca Juga
* కేరళలో కిలో వెండి ధర రూ.67,700గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో..
* హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.67,700 లుగా కొనసాగుతోంది.
* విజయవాడలోనూ వెండి ధర రూ. 67,700 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 67,700 లుగా ఉంది.
కాగా.. ఈ ధరలు గురువారం ఉదయం 6 గంటలకు నమోదైనవి. ప్రతిరోజూ ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కొనుగోలుదారులు ముందుగానే ధరలు తెలుసుకుని వెళ్లడం మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read:
0 Response to "Silver Price Today: పెరిగిన వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..?"
Post a Comment