
Crime News: మరదలితో పెళ్లి చేయలేదని అత్తామామలపై కోపం.. నలుగురు కుమార్తెలకు విషమిచ్చి.. దారుణంగా..

Man dumps 4 kids into water tank: ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. తన భార్య చనిపోవడంతో.. మరదలికిచ్చి పెళ్లి చేయలేదని నలుగురు కుమార్తెలను దారుణంగా చంపాడు. విషం ఇచ్చి వారందరినీ.. నీటి ట్యాంకులో పడేశాడు. మృతులందరూ పదేళ్లలోపు పిల్లలని పోలీసులు తెలిపారు. అనంతరం అతడు కూడా అందులోకి దూకి ఆత్మహత్యకు యత్నించాడని పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటన రాజస్థాన్లోని బాడ్మేర్లో జరిగింది. బాడ్మేర్ పోశాల గ్రామానికి చెందిన పుర్ఖారామ్కు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. అయితే కరోనావైరస్ కారణంగా అతడి భార్య ఐదు నెలల క్రితం మరణించింది. కుమార్తెలకు తల్లి అవసరం ఉందని భావించిన పుర్ఖారామ్.. భార్య చెల్లిని (మరదలు) ఇచ్చి వివాహం చేయాలని అత్తామామలను, కుటుంబసభ్యులను కోరాడు. అందుకు వారు అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు.
ఈ క్రమంలో పుర్ఖారామ్ శనివారం.. కుమార్తెలు జియో (9), నోజి (7), హీనా (3), లాసి (ఏడాదిన్నర) విషం తాగించాడు. అనంతరం వారిని తన ఇంటి ముందు 13 అడుగుల లోతున్న నీటి ట్యాంక్లో పడేశాడు. తర్వాత పుర్ఖారామ్కూడా అందులో దూకి ఆత్మహత్యకు యత్నించాడు. అయితే.. అతను ట్యాంక్లోకి దూకుతుండగా పొరుగింటివార గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, స్థానికులు కలిసి అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారి ఓం ప్రకాశ్ వెల్లడించారు.
ఈ ఘటనలో నలుగురు పిల్లలు కూడా మరణించినట్లు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు. ప్రాణాలతో బయటపడ్డ పుర్ఖారామ్ను జిల్లా ఆసుపత్రిలో చేర్పించామని చికిత్స అందుతుందని పేర్కొ్న్నారు. కాగా.. నిందితుడి వయస్సు 30 ఉంటుందని పోలీసులు తెలిపారు.
Also Read:
Tragedy: విషాదం.. చెరువులో పడి ఏడుగురు బాలికలు మృత్యువాత.. పూజల కోసం వెళ్లి..
Crime News: ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి సజీవ దహనం.. వెళ్తున్న కారులో..
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/2XFWIdd
0 Response to "Crime News: మరదలితో పెళ్లి చేయలేదని అత్తామామలపై కోపం.. నలుగురు కుమార్తెలకు విషమిచ్చి.. దారుణంగా.."
Post a Comment