-->
PM Modi: రైల్వే ప్రయాణికులకు పీఎం మోడీ గుడ్ న్యూస్.. మరో 200 స్టేషన్‌లలో ఆ సదుపాయాలు..

PM Modi: రైల్వే ప్రయాణికులకు పీఎం మోడీ గుడ్ న్యూస్.. మరో 200 స్టేషన్‌లలో ఆ సదుపాయాలు..

Pm Modi

PM Modi: భోపాల్‌లోని కమలపాటి రైల్వే స్టేషన్‌ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం మాట్లాడుతూ.. ఈ స్టేషన్‌ని సందర్శించిన వారు భారతీయ రైల్వేల ఉజ్వల భవిష్యత్‌ని చూస్తారని కొనియాడారు. దేశంలోనే తొలి ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్‌ కమలపాటి రైల్వే స్టేషన్‌ అన్నారు. ఇది దేశానికే గర్వకారణమని అభివర్ణించారు. ఇదే తరహాలో రానున్న కాలంలో దేశంలో 200 స్టేషన్లను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఏడేళ్ల క్రితం రైల్వే స్టేషన్‌ ప్రతిపాదన ఇప్పటికీ దస్త్రాల్లోనే తిరుగుతుందని సమీక్షలో ప్రస్తావనకు వచ్చిందన్నారు. ఈ ప్రభుత్వంలో వ్యవస్థను మార్చే పని మొదలైంది. ఈ రోజు కేవలం మధ్యప్రదేశ్‌కే కాకుండా యావత్ దేశానికి ఉజ్వల చరిత్ర సంగమ దినమని ప్రధాని అన్నారు. స్టేషన్‌కు పునర్వైభవం రావడమే కాకుండా గిన్నార్‌గర్‌ రాణి కమలాపతి పేరు కూడా చేరడంతో స్టేషన్‌ ప్రాధాన్యత మరింత పెరిగిందన్నారు.

రాణి కమలాపతి స్టేషన్ దేశంలోనే మొట్టమొదటి ISO సర్టిఫికేట్, PPP మోడల్‌లో సిద్ధంగా ఉన్న రైల్వే స్టేషన్ అని ప్రధాన మంత్రి అన్నారు. దీని ప్రారంభాన్ని అపూర్వమైనదిగా అభివర్ణించిన పిఎం మోడీ స్టేషన్‌ని రూపొందించిన విధానాన్ని ప్రశంసించారు. ఏ ప్రయాణీకుడికి ఎటువంటి ఇబ్బంది కలగదన్నారు. అంతేకాదు ఈ స్టేషన్ మెట్రో ద్వారా అనుసంధానించారు. మంచి పార్కింగ్ సౌకర్యం కూడా కల్పించారు. వందలాది మంది ప్రయాణికులు ఒక్కసారిగా ఇక్కడ గుమిగూడే అవకాశం ఉంది. కమలపాటి స్టేషన్‌లో భారతీయ రైల్వేల తొలి సెంట్రల్‌ కాన్‌కోర్స్‌ను నిర్మించామని ప్రధాని చెప్పారు. దేశ మార్పునకు భారతీయ రైల్వే మంచి ఉదాహరణగా నిలుస్తోందన్నారు.

‘ఇదే మార్గంలో మరో 200 స్టేషన్లు అభివృద్ధి చేస్తాం’
ఈ సందర్భంగా ప్రధానమంత్రి గత ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు 7 సంవత్సరాల క్రితం అందరూ భారతీయ రైల్వేలను తిట్టేవారని అన్నారు. ప్రజలు తమ వస్తువులను గొలుసులతో కట్టి ఉంచేవారు. స్టేషన్ల వద్ద చాలా మురికి ఉండేది. కానీ నేటి పరిస్థితి గతానికి పూర్తి భిన్నంగా ఉంది. కమలపాటి స్టేషన్ తరహాలో దేశంలోని మరో 200 స్టేషన్లను కూడా అభివృద్ధి చేస్తామని ప్రధాని చెప్పారు. అవి ప్రపంచ స్థాయి PPP మోడల్‌లో ఉంటాయని , విమానాశ్రయంలో ఉండేటువంటి సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు.

T20 World Cup 2021: న్యూజిలాండ్ చేతిలో నుంచి టైటిల్ ఎందుకు జారిపోయింది.. కివీస్‌ చేసిన తప్పేంటో తెలుసా..?

weight loss diets 2021: 2021లో బరువు తగ్గడానికి ఎక్కువగా ఉపయోగించిన డైట్‌ ట్రెండ్స్‌ ఇవే..!

IGNOU UG, PG కోర్సులలో ప్రవేశం పొందడానికి అవకాశం ఉంది.. చివరితేదీ ఎప్పుడంటే..?



from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3nkgbKt

0 Response to "PM Modi: రైల్వే ప్రయాణికులకు పీఎం మోడీ గుడ్ న్యూస్.. మరో 200 స్టేషన్‌లలో ఆ సదుపాయాలు.."

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel