
Silver Price Today: పసిడి బాటలో వెండి.. పరుగులు పెడుతున్న సిల్వర్ ధర.. ప్రధాన నగరాల్లో ధరల వివరాలు..

Silver Price Today: దేశంలో బంగారం, వెండి కొనుగోళ్లు ప్రతిరోజూ రూ.కోట్లలో జరుగుతుంటాయి. ఇక మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా ధరలో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. తాజాగా బంగారం ధరలు పెరుగుతుంటే అదే బాటలో వెండి కూడా పయనిస్తోంది. నిన్న తగ్గిన వెండి ధర.. ఈ రోజు పెరిగింది. శనివారం ఉదయం 6 గంటల సమయానికి నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రధాన నగరాల్లో వెండి ధరలు:
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.64,200 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.64,200 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.68,500 ఉండగా, కోల్కతాలో రూ.64,200 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.64,200 ఉండగా, కేరళలో రూ.68,500 ఉంది. ఇక అహ్మదాబాద్లో కిలో వెండి రూ.64,200 ఉండగా, హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.68,500 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.68,500 ఉండగా, విశాఖపట్నంలో రూ.68,500 ఉంది. అయితే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. వినియోగదారులు కొనుగోలు చేసే సమయానికి ముందుగానే ధరల వివరాలు తెలుసుకోవడం మంచిదంటున్నారు ఆర్థిక నిపుణులు.
కాగా, బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలు ఉన్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇవీ కూడా చదవండి:
Gold Price Today: బంగారం ప్రియులకు షాకింగ్.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. ఏ నగరంలో ఎంత ధర ఉందంటే..!
Nissan Bumper Offer: కారు కొనేవారికి అదిరిపోయే ఆఫర్.. రూ.1 లక్ష వరకు తగ్గింపు.. 2 గ్రాముల బంగారం.. వివరాలివే!
from Telugu News, Telugu Varthalu, (వార్తలు) తెలుగు వార్తలు https://ift.tt/3A5nOIu
0 Response to "Silver Price Today: పసిడి బాటలో వెండి.. పరుగులు పెడుతున్న సిల్వర్ ధర.. ప్రధాన నగరాల్లో ధరల వివరాలు.."
Post a Comment